Corona Virus: ఇండియా పోరాడుతుంది, గెలిచి తీరుతుంది: నరేంద్ర మోదీ

  • కరోనాపై పాట విడుదల చేసిన బాలీవుడ్ తారలు
  • నటించిన అక్షయ్ కుమార్, తాప్సీ, అనన్యా పాండే
  • వీడియోను అభినందించిన ప్రధాని
Narendra Modi Says India Will Win

"భారత్ తిరిగి నవ్వుతుంది, భారత్ మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది" అంటూ ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. తన ట్వీట్ తో పాటు ఆయన, ఓ మ్యూజిక్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

బాలీవుడ్ తారలు ఆక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, తాప్సీ, అనన్యాపాండే తదితరులు ఇందులో నటించారు. సినీ కుటుంబం వేసిన మంచి అడుగు అని ఈ వీడియోను అభివర్ణించిన ప్రధాని, కరోనా వైరస్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతోందని కితాబిచ్చారు.

'ముస్కురాయేగా ఇండియా' పేరిట ఈ సాంగ్ విడుదలైంది. ఈ కష్టకాలంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉంది. మూడు నిమిషాల, 25 సెకన్లు ఉన్న ఈ వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఆ పాటను మీరూ చూడవచ్చు.

More Telugu News