Manchu Vishnu: మంచు విష్ణు 'మోసగాళ్లు' అప్ డేట్

  • విష్ణు కథానాయకుడిగా 'మోసగాళ్లు'
  • ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి
  • జూన్ 5వ తేదీన విడుదల  
Mosagallu Movie

మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'మోసగాళ్లు' సినిమా రూపొందుతోంది. జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో .. పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

నవీన్ చంద్ర .. నవదీప్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని విష్ణు భావించాడు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా విడుదల తేదీ కూడా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆలోగా కరోనా అదుపులోకి వస్తే మాత్రం అదే తేదీన విడుదల చేయాలనే నిర్ణయంతో విష్ణు వున్నాడని అంటున్నారు.

More Telugu News