Revanth Reddy: సీఎం కేసీఆర్ కు ఓ సూచన చేసిన టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

  • ఒడిశా సీఎం ఆలోచన ఆధారంగా  ఈ సూచన చేస్తున్నా
  • మన రాష్ట్రంలోనూ ‘కరోనా’ ట్రీట్ మెంట్ కు ఆసుపత్రి నిర్మించాలి
  • ఈ ఆసుపత్రి నిర్మాణం చేపడితే ఎంపీ ఫండ్స్ నుంచి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తా 
cogress mp Revanth Reddy suggestion to CM KCR

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో వెయ్యి పడకలతో రెండు పెద్ద ఆసుపత్రులను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ ఆలోచనను ఆధారంగా చేసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఓ సూచన చేశారు. మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలని మన సీఎం కేసీఆర్ కు ఓ సూచన చేస్తున్నానని, ‘కరోనా’ కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల రీత్యా ఈ ఆసుపత్రి నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ తరహా ఆసుపత్రి నిర్మిస్తే కనుక ఎంపీ ఫండ్స్ నుంచి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తానని ఓ ట్వీట్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు.


More Telugu News