Bandi Sanjay: కరోనాను కేంద్రం ఆయుష్మాన్ భారత్ లో చేర్చింది: కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

  • కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా సహకరిస్తాం
  • నిత్యావసరాల ధరలను పెంచకుండా దళారులపై చర్యలు తీసుకోండి
  • ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయండి
Bandi Sanjay writes letter to KCR

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి తమ సహకారం పూర్తిగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కరోనాను భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేర్చిందని... ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని విన్నవించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచకుండా దళారులపై చర్యలను చేపట్టాలని కోరారు. కరోనా సహాయ చర్యల్లో పాల్గొని ప్రతి బీజేపీ కార్యకర్త సేవలందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.  

More Telugu News