రేపటి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
- రేపటి నుంచి 25వ తేదీ వరకు మూసివేత
- కరోనా వైరస్ నేపథ్యంలో కీలక నిర్ణయం
- ఇప్పటికే మూతపడ్డ షిర్డీ సాయిబాబా ఆలయం
ప్రతి రోజు ఈ ఆలయానికి విపరీతమైన రద్దీ ఉంటుంది. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైరస్ సోకిన వ్యక్తి స్వామివారి దర్శనానికి వస్తే ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని మూసివేస్తున్నారు. మరోవైపు దేశంలోని పలు ఆలయాలు కూడా మూతపడుతున్నాయి. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.