Road Accident: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం... 20 మంది దుర్మరణం

  • రావల్పిండి నుంచి స్కర్దు వెళుతున్న బస్సు
  • ఘాట్ రోడ్డుపై వెళుతూ అదుపుతప్పిన వైనం
  • ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు
Fatal road accident causes 20 died in Pakistan

పాకిస్థాన్ లో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాల్ని బయటికి తీశారు.

More Telugu News