Corona Virus: 15 మంది ఇటలీ దేశస్తులకు కరోనా.. ఢిల్లీలోని క్వారంటైన్ కు తరలింపు

  • ఇండియా పర్యటనకు వచ్చిన 23 మంది ఇటలీ పర్యాటకులు
  • గత నెలలో ఢిల్లీ నుంచి రాజస్థాన్ కు పయనం
  • జైపూర్ లో ఒక ఇటాలియన్ కు కరోనా పాజిటివ్
15 Italians Quarantined In Delhi

మన దేశంలో కరోనా వైరస్ అనుమానిత కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 15 మంది ఇటాలియన్ టూరిస్టులకు కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. దీంతో, వీరిని ఢిల్లీలోని క్వారంటైన్ కు తరలించారు.

మొత్తం 23 మంది ఇటాలియన్ టూరిస్టులు ఇండియా పర్యటనకు వచ్చారు. గత నెలలో ఢిల్లీ నుంచి రాజస్థాన్ కు వెళ్లారు. వీరిలో ఒక వ్యక్తి ప్రస్తుతం జైపూర్ లో ఉన్నారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయన భార్యకు కూడా వైరస్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 60కి పైగా దేశాలకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 90 వేల మందికి ఈ వైరస్ సోకగా... దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News