YSRCP: గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ‘స్పందన’లో బాధితురాలి ఫిర్యాదు

  • నరసరావుపేట మండలంలోని అర్వపల్లిలో ఘటన
  • ఓ కుటుంబం నివసిస్తున్న ఇంటిని కూల్చివేసిన వైసీపీ శ్రేణులు
  • ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన బాధితురాలు శివమ్మ

గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. నరసరావుపేట మండలంలోని అర్వపల్లిలో ఓ కుటుంబం నివసిస్తున్న ఇంటిని కూల్చి వారిని రోడ్డు పాలు చేశారు. ఆ ఇంటికి సంబంధించిన సామగ్రిని అక్కడి పంచాయతీ కార్యాలయంలో పడేశారని, ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే తమను చంపేస్తామని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితురాలు శివమ్మ ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఆర్డీవో ఎదుట తన ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

More Telugu News