Yanamala: ఇటువంటి చరిత్ర ప్రపంచంలోనే లేదు: వైసీపీపై యనమల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనపై సిట్ వేసిన చరిత్ర ప్రంపచంలోనే ఎక్కడా లేదని అన్నారు. వైఎస్ జగన్ అవినీతిపై విచారణ న్యాయస్థానాల్లో ముగింపు దశకు చేరిందని, ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు.
గత టీడీపీ పాలనపై జగన్ ప్రభుత్వం అనేక విచారణలు జరిపిందని యనమల చెప్పారు. అయినప్పటికీ ఏ ఆరోపణనూ రుజువు చేయలేక పోయారని అన్నారు. టీడీపీని అప్రదిష్టపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తాము కోరామని యనమల చెప్పారు. తాము ఈ డిమాండ్పై వెనక్కి తగ్గట్లేదని తెలిపారు. హత్యలకన్నా ఆర్థికనేరాలు ప్రమాదకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొందని, 9 నెలల పాలనలో జగన్ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు తీవ్ర నష్టం కలిగిందని ఆయన విమర్శించారు.
గత టీడీపీ పాలనపై జగన్ ప్రభుత్వం అనేక విచారణలు జరిపిందని యనమల చెప్పారు. అయినప్పటికీ ఏ ఆరోపణనూ రుజువు చేయలేక పోయారని అన్నారు. టీడీపీని అప్రదిష్టపాలు చేయడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తాము కోరామని యనమల చెప్పారు. తాము ఈ డిమాండ్పై వెనక్కి తగ్గట్లేదని తెలిపారు. హత్యలకన్నా ఆర్థికనేరాలు ప్రమాదకరమైనవని సుప్రీంకోర్టు పేర్కొందని, 9 నెలల పాలనలో జగన్ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు తీవ్ర నష్టం కలిగిందని ఆయన విమర్శించారు.