కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భూకంపం!
- నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో ప్రకంపనలు
- అర్ధరాత్రి 2.36 గంటల సమయంలో ఘటన
- బయటకు పరుగులు తీసిన ప్రజలు
సుమారు ఆరు సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు, వంటపాత్రలు కదిలాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవార్లూ తిరిగి ఇళ్లలోకి వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ, చలిలో వణుకుతూ ఉండిపోయారు. కాగా, సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే గణతంత్ర దినోత్సవం రోజున ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయన్న సంగతిని ప్రజలు గుర్తు చేసుకున్నారు.