school: బడిలోకి దెయ్యాలు వస్తున్నాయట.. క్షుద్రపూజలు చేసి కలకలం రేపిన వైనం

షార్ట్స్‌లో చూడండి
చదువుకుంటే మూఢ నమ్మకాలు పోతాయి.. చదువుకోసం బడికి వెళ్లాలి. అయితే, బడులే మూఢ నమ్మకాలను పెంచుకోవడానికి మొదటిమెట్టుగా నిలిస్తే..? వరంగల్ రూరల్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఇదే తీరు కనపడుతోంది. ఆ బడిలో ప్రధానోపాధ్యాయురాలు మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తోంది.

అక్కడ జరిగిన విషయాన్ని గురించి తెలుసుకుంటే ఈ విషయాన్ని ఎవరైనా నిజమేనంటారు. తమ బడికి దెయ్యాలు, భూతాలు వస్తున్నాయంటూ మూఢనమ్మకంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యుడితో క్షుద్ర పూజలు చేయించి కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయురాలే ఇలా వ్యవహరిస్తే ఇక విద్యార్థులు ఏ మార్గంలో వెళతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Go Back to Shorts
school
Warangal Rural District

More Telugu News