Kanakamedala Ravindra Kumar: మూడు రాజధానుల వల్ల హింస, అభద్రత, దాడులు పెరుగుతాయి: కనకమేడల

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ న్యాయవిభాగం చీఫ్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల హింస, అభద్రత, దాడులు పెరుగుతాయని అన్నారు. జగన్ మొండివైఖరి ప్రదర్శిస్తే తాము చట్టసభల్లో పోరాటం సాగిస్తామని తెలిపారు. చంద్రబాబు పథకాలు, టీడీపీ హయాంలో సాధించిన అభివృద్ధి ఏదీ కనిపించకూడదని కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రాష్ట్ర విభజన కన్నా నేడు జగన్ పాలన కారణంగానే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని కనకమేడల విమర్శించారు. విభజన చట్టాన్ని అనుసరించాలని, దాని ప్రకారం ఒకే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Kanakamedala Ravindra Kumar
Telugudesam
Andhra Pradesh
Amaravati
AP Capital
YSRCP
Jagan

More Telugu News