ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత

  • నిన్న వెంకటరెడ్డి హత్య
  • ఆందోళనకు దిగిన గ్రామస్తులు
  • నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన వైనం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అతడి హత్యను నిరసిస్తూ నిందితుడి ఇంటిపై దాడి చేశారు. నిందితుడి ఇంటికి నిప్పుపెట్టడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.

నిన్న సిరిపురం-గొలనుకొండ రహదారిలో వెంకటరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైకుపై అతడు తన భార్యతో కలిసి జనగామకు వెళ్లి వస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వెంకటరెడ్డి బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తును పెంచారు.
Go Back to Shorts
Yadadri Bhuvanagiri District
Crime News

More Telugu News