మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణపై ‘స్పందన’లో ఫిర్యాదు
- విజయనగరంలో ‘స్పందన’లో అధికారులకు ఫిర్యాదు
- సత్యసాయినగర్ లేఔట్ లో ప్లాట్స్ ను కబ్జా చేశారని ఆరోపణ
- తమ స్థలాల చుట్టూ ప్రహరీ కట్టారంటున్న బాధితులు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ఆదినారాయణపై ‘స్పందన’ లో ఫిర్యాదు చేశారు. విజయనగరంలోని సత్యసాయినగర్ లేఔట్ లోని ప్లాట్స్ ను కబ్జా చేశారని ఆరోపిస్తూ ‘స్పందన’లో అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తమ లేఔట్ కు అన్ని అనుమతులు ఉన్నా తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారని ఆరోపించారు.