మే, జూన్ నాటికీ రెండు పోర్టులకు శంకుస్థాపన: సీఎం జగన్
- రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష
- తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి ఆదేశం
- పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూసేకరణ ప్రారంభించాలని సూచన
కాగా, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్ కల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం స్పందిస్తూ.. మే, జూన్ నాటికి రెండు పోర్టులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం, కేంద్రం నిధులు ఇస్తామని చెప్పిందంటూ.. ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.