నేను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నాను: పవన్ కల్యాణ్
- భాషజోలికొస్తే ఊరుకునేది లేదు
- తెలుగు కవుల రచనలపై కార్యశాలలు నిర్వహించాలి
- మన నుడి- మన నది కార్యక్రమ లక్ష్యమిదే
- ఏడు కొండలస్వామి సమక్షంలో ప్రారంభించడం మా అదృష్టం
'నేను ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆంగ్ల మాధ్యమం చదువే గొప్ప అయితే, ఆ మాధ్యమంలో చదివిన వారు అవినీతికి పాల్పడి జైలుకు ఎందుకు వెళ్లారు? తెలుగు కవుల రచనలపై కార్యశాలలు నిర్వహించాలి. మన నుడి- మన నది కార్యక్రమ లక్ష్యమిదే. ఏడు కొండలస్వామి సమక్షంలో ప్రారంభించడం మా అదృష్టం. తెలుగు సినిమాలో మన సాహిత్యం రోజురోజుకు దిగజారిపోతోంది. తెలుగు భాష నిర్లక్ష్యం కావడానికి తరతరాలుగా వ్యవస్థను నడుపుతోన్న పాలకుల నిర్లక్ష్యమే కారణం' అని వ్యాఖ్యానించారు.