క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ
- ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న అనంతపురం విద్యార్థిని
- బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
- ధైర్యం చెప్పిన బాలయ్య
తాజాగా, స్వప్నను బాలయ్య పరామర్శించారు. ఎంతో ఆప్యాయంగా ఆ విద్యార్థినితో మాట్లాడిన ఆయన భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితి వివరాలు తెలుసుకున్నారు. బాలయ్య ఆత్మీయత చూసి ఆ విద్యార్థిని ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. కాగా, మరికొన్నిరోజుల్లో స్వప్నకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఆమెను పరామర్శించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన స్వప్నకు పలు కానుకలు కూడా అందించారు.

