Telugudesam: కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి: అంబటి రాంబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది అనుమానాస్పద మృతిలా కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల మృతి చాలా బాధాకరమని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. కోడెల మృతిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, ‘ఆత్మహత్య’ అని కొందరు, ‘గుండెపోటు’ అని మరికొందరు అంటున్నారని అన్నారు. కోడెలది వివాదాస్పద మరణంలా కనిపిస్తోందని, దీనిపై తక్షణమే తెలంగాణ సర్కార్ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
Go Back to Shorts
Telugudesam

More Telugu News