Andhra Pradesh: వచ్చే నెలలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
ఏపీ సీఎం జగన్ వచ్చే నెలలో ఢిల్లీ వెళుతున్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీలో గడుపుతారు. జగన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర సమస్యలు, పెండింగ్ లో ఉన్న అంశాల గురించి, ఆర్థిక సాయం గురించి వారి దృష్టికి తేనున్నట్టు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా జగన్ కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.