Dokka manikyavara Prasad: ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాలి: డొక్కా మాణిక్యవరప్రసాద్
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చర్చ జరుగుతోందని, ఏపీలో కూడా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై పోరాటానికి సైతం వెనుకాడేది లేదన్నారు. ఎస్సీ వర్గీకరణను కించపరిచేలా జగన్ మాట్లాడటం సరికాదన్నారు. వర్గీకరణ విషయంలో జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని డొక్కా డిమాండ్ చేశారు.