jjp nadda: జేపీ నడ్డా వచ్చాక మొట్టమొదటి ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇది!: టీడీపీ మాజీ ఎంపీ రామ్మోహన్ రావు విమర్శలు

టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరుతున్నారన్న కథనాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రామ్మోహన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటి ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇది అని వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా దగ్గరుండి మరీ టీడీపీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ దగ్గరకు తీసుకెళ్లారని, దీన్ని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్టీ మారనున్న తమ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఏవైనా సమస్యలు ఉంటే పార్టీలో చర్చించుకోవాలే తప్ప, పార్టీని వీడటం కరెక్టు కాదని సూచించారు.
jjp nadda
bjp
Telugudesam
ram mohan rao

More Telugu News