ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కమలహాసన్
- నా వ్యాఖ్యలు గాడ్సేకు మాత్రమే పరిమితం
- చారిత్రక వాస్తవమే మాట్లాడా
- నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు
తన వ్యాఖ్యలు గాడ్సేకు మాత్రమే పరిమితమని, మొత్తం హిందువులకు సంబంధించినవి కావని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కమల్ మీడియాతో మాట్లాడుతూ, తాను అరవకురిచ్చిలో మాట్లాడిన విషయంపై అందరికీ కోపం వస్తోందని, స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాది అని తాను ఒక్కసారి చెప్తే, మీడియా 200 సార్లు చెబుతోందన్నారు. తాను చారిత్రక వాస్తవాన్ని మాట్లాడానని, దీనిపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనను అవమానపరిచేందుకు యత్నిస్తే వాళ్లే ఓడిపోతారని కమల్ పేర్కొన్నారు.