ఒకరినే మనువాడిన అక్కాచెల్లెళ్లు... ఒకేసారి మరణం!
- కరీంనగర్ జిల్లాలో ఘటన
- గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరూ మృతి
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో శంకరపట్నం మండలానికి చెందిన అక్కా చెల్లెళ్లు సుజాత (35), సులోచన (28) అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుని గొడవలు లేకుండా కాపురం చేసుకుంటున్నారని స్థానికులు వెల్లడించారు. ఈ అక్కాచెల్లెళ్ల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు.