'చిత్రలహరి' నుంచి యూత్ హృదయాలను దోచుకునే పాట
- కిషోర్ తిరుమల నుంచి మరో ప్రేమకథ
- తేజు జోడీగా కల్యాణి ప్రియదర్శన్
- ఏప్రిల్ 12వ తేదీన భారీ విడుదల
ప్రకృతి తనకి ప్రసాదించిన కొత్త అందమే ఈ ప్రియురాలు అనే భావానికి అక్షర రూపమిచ్చి కథానాయకుడు పాడుకునే పాట ఇది. సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ పై చిత్రీకరించిన ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలా వుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. సుదర్శన్ అశోక్ ఆలాపన యూత్ మనసులను పట్టేసేలా వున్నాయి. తేలికైన పదాలతో శ్రీమణి అందమైన .. అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాడు. ఈ సినిమాతో తేజు హిట్ కొడతాడేమో చూడాలి.