నేడు శబరిమల పరిరక్షణ సమితి ‘మహా ఉపవాస దీక్ష’
- ఆలయ పవిత్రత కాపాడాలంటూ డిమాండ్
- ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అభ్యంతరం
- కొనసాగుతున్న హిందూ సంస్థ నిరసనలు
ఇటీవల ఇద్దరు మహిళలు తొలిసారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి దర్శనం చేసుకోవడం, ఈ విషయం వెల్లడి కావడంతో హిందూ సంస్థలు భగ్గుమనడం, ఆలయంలో సంప్రోక్షణలు నిర్వహించడం తెలిసిందే. అప్పటి నుంచి కేరళ అట్టుడుకుతుండగా, ఇతర ప్రాంతాలకు నిరసనలు విస్తరిస్తున్నాయి. కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.