మేము అధికారంలోకి వచ్చాక ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు: నిర్మలా సీతారామన్
- ఐదేళ్లలో దేశం శాంతిభద్రలతో ఉంది
- వివిధ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం
- అవినీతి అంతం ఎన్డీయే సాధించిన విజయం
ఈ ఐదేళ్లలో దేశం శాంతి భద్రలతో ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దేశంలో వ్యవసాయ, గృహ నిర్మాణ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా చేయడం, అవినీతి అంతం అనే అంశాలు ఎన్డీయే సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకోవచ్చని ఆమె అన్నారు.