Telangana: కంటోన్మెంట్ లో రాత్రి కేటీఆర్ రోడ్ షో.. కేసు నమోదు చేసిన మారేడ్ పల్లి పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొరడా ఝుళిపించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్ణీత సమయం దాటడంతో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న, ఇతరులపై ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మారేడ్ పల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.

కంటోన్మెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్నకు మద్దతుగా గురువారం రాత్రి 10.30 గంటలు దాటినప్పటికీ మంత్రి కేటీఆర్ మారేడ్ పల్లి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఘటనను గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మారేడ్ పల్లి పోలీసులకు  ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయమై మారేడ్ పల్లి పీఎస్ సీఐ శ్రీనివాసులు స్పందిస్తూ.. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి సాయన్న, ఇతరులపై ఐపీసీ 341, 188, 67 సెక్షన్లతో పాటు సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Go Back to Shorts
Telangana
KTR
TRS
contonment
road shoe
code violation
Police
case
registered
sayanna
maredpally

More Telugu News