గుండెపోటుతో టీఆర్ఎస్ నాయకుడి మృతి.. ప్రచారంలో అపశ్రుతి
- కుత్బుల్లాపూర్లో ప్రచారంలో ఉండగా ఘటన
- భోజనం చేస్తుండగా కుప్పకూలిన వెన్నెలగడ్డకు చెందిన రమేష్
- ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు నిర్థారణ
ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన నాయకులు, కార్యకర్తలు రమేష్ను హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్థారించారు. గుండె పోటుతోనే రమేష్ మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు.