95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ.. టీడీపీకి 14 సీట్లు: ఉత్తమ్
- టీజేఎస్, సీపీఐతో కొనసాగుతున్న చర్చలు
- ఈ నెల 8 లేదా 9న ప్రకటన
- ఢిల్లీలో వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇప్పటివరకు పరిశీలించిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు ఓ కొలిక్కి వచ్చిందని, మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ బరిలో ఉంటుందని స్పష్టతనిచ్చారు. మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయని వివరించారు. అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలా..? వద్దా? అనే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ తెలిపారు.
కూటమిలోని పార్టీలతో చర్చలు పూర్తయ్యాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈనెల 8న మరోసారి సమావేశమై అభ్యర్థుల తుది జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశముందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా వెల్లడించారు.