మోదీకి చెయ్యిచ్చిన ట్రంప్.. రిపబ్లిక్ డే వేడుకలకు డుమ్మా!
- రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మోదీ
- షెడ్యూలు సహకరించడం లేదన్న వైట్ హౌస్
- త్వరలోనే మోదీని ట్రంప్ కలుస్తారన్న సారా
తాజాగా వైట్హౌస్ మరో ప్రకటన విడుదల చేస్తూ.. ‘‘భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందింది. అయితే, షెడ్యూలు సహకరించని కారణంగా ట్రంప్ హాజరు కాబోవడం లేదు’’ అని అందులో పేర్కొన్నారు. మోదీకి- ట్రంప్కు మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, అమెరికా-భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్టు వైట్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. వీలైనంత త్వరలో మోదీని కలవాలని ట్రంప్ యోచిస్తున్నట్టు చెప్పారు.