మరో మైలురాయి... నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని తాకనున్న జగన్ పాదయాత్ర!
- దేశపాత్రునిపాలెంకు చేరుకోగానే చారిత్రక ఘట్టం
- ప్రత్యేక పైలాన్ ను ఆవిష్కరించనున్న జగన్
- విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర
ఈ ఉదయం జగన్, ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతల పాలెంలో నడుస్తున్న వేళ, రహదారులు జనసంద్రంగా మారిపోయాయి. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న జగన్, తనను పలకరిస్తున్న వారితో మాట్లాడుతూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా చింతల పాలెంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ఈ మధ్యాహ్నం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని తాకనుండగా, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో ఇందుకు గుర్తుగా ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు. ఆపై సాయంత్రం కొత్తవలసలో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.