ట్రక్కు బీభత్సం.. కాలి బూడిదైన 11 మంది ప్రయాణికులు
- ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘటన
- బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు
- బొలెరో వాహనంలో మంటలు చెలరేగి 11 మంది సజీవ దహనం
- మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్న పోలీసులు
- ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయి పలు వాహనాలను ఢీకొట్టడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్రమాండ్గంజ్ లోయ నుంచి లసోడా ప్రాంతం వైపు వస్తున్న ట్రక్కుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. మొదట ఓ కంటైనర్ను ఢీకొట్టి, ఆపై ఈ రెండు వాహనాల మధ్య చిక్కుకున్న ఒక ఆల్టో కారును నుజ్జునుజ్జు చేసింది. అంతటితో ఆగకుండా ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారిణి అపర్ణా రజత్ కౌశిక్ ధ్రువీకరించారు. మృతుల వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొందరి కుటుంబ సభ్యులను గుర్తించి వారికి సమాచారం అందించామని తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు బీహార్ రిజిస్ట్రేషన్తో ఉండగా, మరో ట్రక్కు మధ్యప్రదేశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కార్లలో ఒకటి సోన్భద్ర జిల్లాకు, మరొకటి మీర్జాపూర్ జిల్లాకు చెందినవని తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్రమాండ్గంజ్ లోయ నుంచి లసోడా ప్రాంతం వైపు వస్తున్న ట్రక్కుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. మొదట ఓ కంటైనర్ను ఢీకొట్టి, ఆపై ఈ రెండు వాహనాల మధ్య చిక్కుకున్న ఒక ఆల్టో కారును నుజ్జునుజ్జు చేసింది. అంతటితో ఆగకుండా ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు మంటల్లో కాలి బూడిదయ్యారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారిణి అపర్ణా రజత్ కౌశిక్ ధ్రువీకరించారు. మృతుల వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కొందరి కుటుంబ సభ్యులను గుర్తించి వారికి సమాచారం అందించామని తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు బీహార్ రిజిస్ట్రేషన్తో ఉండగా, మరో ట్రక్కు మధ్యప్రదేశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కార్లలో ఒకటి సోన్భద్ర జిల్లాకు, మరొకటి మీర్జాపూర్ జిల్లాకు చెందినవని తెలిపారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.