Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

  • ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • గరుడ పటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం
  • తొలి రోజున పెద్దశేష వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి
తిరుమల కొండపై ఉత్సవ శోభ నెలకొంది. అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను తలపై మోస్తూ, శ్రీవారికి సమర్పించారు. ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గరుడ పటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. తొలి రోజున పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
Tirumala
brahmotsavalu
Chandrababu

More Telugu News