మోదీకి వారణాసిలోనూ భంగపాటు: రాహుల్ గాంధీ
- 2019 తర్వాత కాంగ్రెస్కు పునర్వైభవం
- కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిస్తే వారణాసిలోనూ మోదీ ఓడిపోతారు
- కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ సిద్ధ రామయ్యే సీఎం
వచ్చే నెలలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యే మళ్లీ పగ్గాలు చేపడతారని స్పష్టం చేశారు. మోదీ పాలనలో ఎవరూ సంతృప్తిగా లేరని, రైతులు, దళితులు, పేదలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. ఇలా అందరూ అసంతృప్తిగానే ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు.