Chief Justis: సంచలన నిర్ణయం... చీఫ్ జస్టిస్ ముందు ఏ కేసూ వాదించకుండా సిబల్, మను సంఘ్వీ, వివేక్ లపై నిషేధం!

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ నేతలు, దేశంలో ప్రముఖ న్యాయవాదులుగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సహా అభిషేక్ మనూ సంఘ్వి, వివేత్ తన్ఖాలను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా విచారించే ఏ కేసులోనూ వాదించకుండా బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ మిశ్రా వెల్లడించారు.

 ప్రజా ప్రతినిధులు కోర్టుల్లో తమ ప్రాక్టీస్ ను కొనసాగించకుండా ఆపేందుకు తమకు హక్కు లేదని, అయితే, ఈ కేసు ప్రత్యేకమైనదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని పట్టుబడుతున్నవారు, ఆయన ముందు కేసులను ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. బార్ కౌన్సిల్ లోని అత్యధికులతో చర్చించిన మీదటే, వారి అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై సిబల్, సంఘ్వీ, తన్ఖాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తమను ఏ కోర్టుకూ రాకుండా, వాదనలు వినిపించకుండా చేసే హక్కు బార్ కౌన్సిల్ కు లేదని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chief Justis
Dipak Mishra
Supreme Court
India
Kapil Sibal

More Telugu News