చిదంబరం మెడకు ఉచ్చు... విచారణకు సిబీఐ నోటీసులు!
- చిదంబరాన్ని ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం
- నోటీసుల జారీకి రంగం సిద్ధం
- రాజకీయ కక్షసాధింపంటున్న చిదంబరం
యూపీఏ హయాంలో ఐఎన్ఎక్స్ మీడియాకు లబ్ది కలిగేలా కార్తీ చిదంబరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, అప్పటి ఆర్థికమంత్రిగా చిదంబరం తన కుమారుడికి సహకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తన కుటుంబాన్ని నరేంద్ర మోదీ సర్కారు ఇబ్బందులు పెడుతోందని చిదంబరం ఆరోపిస్తున్నా, సీబీఐ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. కాగా, నిన్న కార్తీని ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న సీబీఐ, నేడు కూడా ఆయన్ను ప్రశ్నిస్తోంది.