తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్: సురేశ్ బాబు
- అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం
- భవిష్యత్తులో చిన్న సినిమాలకు కూడా లాభాలు వస్తాయి
- ఐదు రాష్ట్రాల నిర్మాతలతో సంయుక్తంగా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకున్నాం
- డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు పీపీఎఫ్ తగ్గించట్లేదు
తాము తీసుకుంటోన్న చర్యలతో భవిష్యత్తులో చిన్న సినిమాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్ ఉంటుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల నిర్మాతలతో సంయుక్తంగా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకున్నామని సురేశ్ బాబు చెప్పారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు పీపీఎఫ్ తగ్గించట్లేదని ఆయన అన్నారు.