తెలుగు రాష్ట్రాలకు కొత్తగా మరో 7 'నీట్' పరీక్షా కేంద్రాలు
- ఆంద్రప్రదేశ్ కు కొత్తగా ఐదు నీట్ పరీక్షా కేంద్రాలు
- తెలంగాణలో మరో రెండు పరీక్షా కేంద్రాలు
- ఈ ఏడాది నుంచే అమలు
రెండు రాష్ట్రాల వినతుల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరంలలో నీట్ కేంద్రాలను ఏర్పాట్లు చేయనున్నామని, అలాగే తెలంగాణలోని ఖమ్మం, రంగారెడ్డిలలో నీట్ పరీక్షా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నామని చెప్పింది. 2018 నీట్ పరీక్షను ఈ కొత్తకేంద్రాల్లో కూడా నిర్వహించనున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది.