ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన అరుణ్ జైట్లీ
- ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు వార్తలు
- అదేం లేదన్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ
- ‘జమిలి’ ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడామన్న మంత్రి
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, అటువంటి ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలని మాత్రమే తాము కోరుకుంటున్నాం తప్పితే ముందస్తును కోరుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ఎన్నికలను వాయిదా వేసే ఉద్దేశం కూడా తమకు లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ అలా జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, కాబట్టి అటువంటి ఆలోచన కేంద్రానికి లేదని జైట్లీ స్పష్టం చేశారు.