మేడారం జాతరకు వచ్చిన చత్తీస్గఢ్ సీఎం.. సారలమ్మను దర్శించుకోకుండానే వెళ్లిపోయిన వైనం
- సమ్మక్కను దర్శించుకుని గద్దె వద్ద కాసేపు నిలబడ్డ రమణ్ సింగ్
- అదే సమయంలో కొబ్బరికాయలు విసిరిన భక్తులు
- అప్రమత్తమై సీఎంకు తగలకుండా కాపాడిన భద్రతాసిబ్బంది
- తృటిలో తప్పిన ప్రమాదం
ముఖ్యమంత్రి భద్రతాసిబ్బంది వెంటనే అప్రమత్తం అవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. దీంతో సమ్మక్కను దర్శించుకున్న రమణ సింగ్ సారలమ్మను దర్శించుకోకుండానే వెళ్లిపోయారు. సీఎం రమణ సింగ్ ఆ సమయంలో వస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. అక్కడ సీఎం ఉన్నప్పటికీ అధికారులు క్యూలైన్ను నిలిపివేయలేదు.
కాగా, రేపు సీఎం కేసీఆర్ మేడారం వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి, మధ్యాహ్నం 1.15 గంటలకు మేడారం చేరుకొని, 1.25 గంటలకు గద్దెల ప్రాంగణానికి వస్తారు. ఇరవై నిమిషాలపాటు అక్కడే ఉంటారు.