మూడడుగుల ముష్కరుడిని కాల్చి చంపిన సైన్యం!
- జైషే కమాండర్ నూర్ హతం
- కాన్వాయ్ పై దాడికి వచ్చిన నూర్ ను కాల్చి చంపిన సైన్యం
- గత మూడు నెలల్లో 15 మంది ముఖ్య నేతలు హతం
శ్రీనగర్-జమ్ము హైవేపై వెళ్తున్న భద్రతా బలగాల కాన్వాయ్ పై దాడి చేసేందుకు ఈ తెల్లవారుజామున నూర్ వచ్చాడు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో... నూర్ ను సైనికులు కాల్చి చంపారు. 2003లో నూర్ ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2015లో పెరోల్ పై వచ్చిన అతను... జైషే మహ్మద్ లో చేరాడు. గత మూడు నెలల్లో 15 మంది జైషే ముఖ్య నేతలను సైన్యం మట్టుబెట్టడం గమనార్హం.