KCR: కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి .. కానిస్టేబుల్ ను ఢీకొన్న వాహనం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు షాద్ నగర్ మండలంలోని జహంగీర్ పీర్ దర్గాను సందర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వస్తానని, మొక్కులు చెల్లించుకుంటానని ఆయన మొక్కుకున్నారు. ఇప్పుడు ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వినోద్, ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, అంజయ్య యాదవ్ తదితరులు దర్గాకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఓ కానిస్టేబుల్ ను ఢీకొంది. కీసర పోలీస్ స్టేషన్ కు చెందిన రవి కిరణ్ కు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వెంటనే అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవికిషన్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
KCR
telangana cm
jahangir peer darga

More Telugu News