అంతర్జాతీయ స్థాయిలో మేడారం జాతర: ఈటల రాజేందర్
- ఫిబ్రవరిలో మేడారం జాతర
- కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం
- ఇప్పటికే రూ. 80 కోట్లు విడుదల చేశాం
గత ప్రభుత్వాలు జాతర నిర్వహణ కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు మాత్రమే నిధులను కేటాయించేవని... తమ ప్రభుత్వ వచ్చిన తర్వాత జాతర కోసం రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న యాత్రకు ఇప్పటికే రూ. 80 కోట్లు విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేస్తామని చెప్పారు. రానున్న ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనుంది.