స్విస్ జంటపై దాడి కేసులో ఐదుగురు మైనర్ల అరెస్ట్.. కొనసాగుతున్న గాలింపు
- ఫతేఫూర్ సిక్రీలో స్విస్ జంటపై దాడి
- నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం యోగి
- పొదలమాటున ఏకాంతంగా ఉండగా దాడి చేశారన్న డీఎస్పీ
స్విస్ జంటపై దాడి సంచలనం సృష్టించింది. పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసే ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. స్విస్ జంటపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురూ మైనర్లే కావడం గమనార్హం. పరారీలో ఉన్న ఆరో నేరగాడూ కూడా మైనరే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
కాగా, స్విస్ జంట పొదల మాటున ఏకాంతంగా ఉండడాన్ని చూసిన నిందితులు వారిపై దాడి చేశారని డీఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ తెలిపారు.