జగన్ కు ఊరటా? చుక్కెెదురా?.. నేడు కోర్టు నిర్ణయం!
- పాదయాత్ర చేపట్టనున్న వైఎస్ జగన్
- ప్రతి వారమూ కోర్టుకు రాలేనని వెల్లడి
- నేడు నిర్ణయం తీసుకోనున్న సీబీఐ కోర్టు
ఇప్పటికే ఈ విషయంలో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే విన్నవించుకోవాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఆపై జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన స్పెషల్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ సైతం నేడు కోర్టుకు చేరనుంది.
ఈ నేపథ్యంలో పాదయాత్ర చేసేందుకు ఊరట లభిస్తుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, తాను నవంబర్ 2 నుంచి పాదయాత్రను చేపట్టనున్నానని, ఇడుపులపాయ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి, అక్కడి నుంచి అన్ని జిల్లాలనూ తాకుతూ యాత్ర సాగుతుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.