డేరా బాబా ఆశ్రమంలో దొంగలు పడ్డారు
- డేరా బాబా వస్తువుల చోరీ
- కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు కూడా
- అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు
- కట్టుదిట్టమైన భద్రత ఉన్నా... చోరీ జరిగింది
దొంగలు చోరీ చేసిన వాటిలో ముఖ్యంగా సీసీటీవీలు, కంప్యూటర్లు, పలు హార్డ్ డిస్క్ లు, పరుపులు ఉన్నాయి. మరోవైపు, డేరాబాబా అరెస్ట్ తర్వాత అక్కడ అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి తోడు డేరాకు సొంత సెక్యూరిటీ కూడా ఉంది. ఇంత భద్రత మధ్య డేరాలోకి దొంగలు చొరబడటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఐజీ నవదీప్ విర్క్ తెలిపారు.