Tamilnadu: తమిళనాడులో కొత్త టెన్షన్.. కొత్త సీఎం, హోంశాఖ, అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు నోటీసులు

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త ఉత్కంఠ మొదలైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఫిబ్రవరి 18న జరిగిన బల పరీక్ష చెల్లదంటూ డీఎంకే వేసిన పిటిషన్ పై స్పందించిన మద్రాస్ హైకోర్టు సోమవారం.. కొత్త సీఎం పళనిస్వామితో పాటు ఆ రాష్ట్ర హోం శాఖకు, అసెంబ్లీ సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. ఆ రోజున శాసనసభ నుంచి విపక్షం మొత్తాన్ని బయటకు పంపి, బలపరీక్ష నిర్వహించారంటూ ఐదు రోజుల కింద డీఎంకే నేత స్టాలిన్ ఈ పిటిషన్ వేశారు. అంతేగాకుండా బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలను నిర్బంధించి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఒత్తిడి చేశారని అందులో హైకోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
Go Back to Shorts
Tamilnadu
Assembly
Voting
palaniswami
AIDMK
DMK
stalin
vote

More Telugu News