దేశంలో విద్యుత్ వినియోగంలో భారీ జంప్.. పదేళ్లలో రెట్టింపైన డిమాండ్
- పదేళ్లలో పీక్ విద్యుత్ డిమాండ్ దాదాపు రెట్టింపు
- మే 21న 270.8 గిగావాట్లకు చేరిన గరిష్ఠ డిమాండ్
- జులై 2026 నాటికి 552 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం
- 5.10 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లకు పెరిగిన ట్రాన్స్మిషన్ నెట్వర్క్
- పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో భారత్ మూడో స్థానం
దేశంలో విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. పదేళ్లలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ దాదాపు రెట్టింపైంది. 2013-14లో 135.9 గిగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ 2026 మే 21న రికార్డు స్థాయిలో 270.8 గిగావాట్లకు చేరింది.
ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరగడం, పరిశ్రమలు విస్తరించడం, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం దీనికి ప్రధాన కారణాలని కేంద్రం శుక్రవారం తెలిపింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా దేశం భారీగా పెంచింది.
2014 మార్చిలో 249 గిగావాట్లుగా ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2026 జులై నాటికి 552 గిగావాట్లకు చేరింది. దీంతో ప్రస్తుత అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్తులో పెరగనున్న డిమాండ్ను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది.
విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా గణనీయంగా విస్తరించింది. 2014 ఏప్రిల్లో 2,91,336 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉన్న ట్రాన్స్మిషన్ నెట్వర్క్ 2026 జులై నాటికి 5,10,594 సర్క్యూట్ కిలోమీటర్లకు చేరింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయడం మరింత సులభమైంది.
ఇదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోనూ భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ఐఆర్ఈఎన్ఏ విడుదల చేసిన ‘రిన్యూవబుల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2026’ ప్రకారం పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.
2026 మార్చి 31 నాటికి దేశంలో మొత్తం శిలాజేతర విద్యుత్ సామర్థ్యం 283.46 గిగావాట్లుగా ఉంది. ఇందులో 274.68 గిగావాట్లు పునరుత్పాదక ఇంధనం, 8.78 గిగావాట్లు అణు విద్యుత్ సామర్థ్యం. 2025-26లో రికార్డు స్థాయిలో 55.3 గిగావాట్ల శిలాజేతర సామర్థ్యం అదనంగా చేరింది.
2025 జూన్లో భారత్ కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో శిలాజేతర ఇంధనాల వాటా 50 శాతానికి చేరింది. దీంతో 2030 నాటికి చేరుకోవాల్సిన పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని భారత్ ఐదేళ్లు ముందుగానే సాధించింది.
ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరగడం, పరిశ్రమలు విస్తరించడం, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం దీనికి ప్రధాన కారణాలని కేంద్రం శుక్రవారం తెలిపింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా దేశం భారీగా పెంచింది.
2014 మార్చిలో 249 గిగావాట్లుగా ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2026 జులై నాటికి 552 గిగావాట్లకు చేరింది. దీంతో ప్రస్తుత అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్తులో పెరగనున్న డిమాండ్ను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగింది.
విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా గణనీయంగా విస్తరించింది. 2014 ఏప్రిల్లో 2,91,336 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉన్న ట్రాన్స్మిషన్ నెట్వర్క్ 2026 జులై నాటికి 5,10,594 సర్క్యూట్ కిలోమీటర్లకు చేరింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయడం మరింత సులభమైంది.
ఇదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోనూ భారత్ వేగంగా ముందుకెళ్తోంది. ఐఆర్ఈఎన్ఏ విడుదల చేసిన ‘రిన్యూవబుల్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ 2026’ ప్రకారం పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.
2026 మార్చి 31 నాటికి దేశంలో మొత్తం శిలాజేతర విద్యుత్ సామర్థ్యం 283.46 గిగావాట్లుగా ఉంది. ఇందులో 274.68 గిగావాట్లు పునరుత్పాదక ఇంధనం, 8.78 గిగావాట్లు అణు విద్యుత్ సామర్థ్యం. 2025-26లో రికార్డు స్థాయిలో 55.3 గిగావాట్ల శిలాజేతర సామర్థ్యం అదనంగా చేరింది.
2025 జూన్లో భారత్ కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో శిలాజేతర ఇంధనాల వాటా 50 శాతానికి చేరింది. దీంతో 2030 నాటికి చేరుకోవాల్సిన పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని భారత్ ఐదేళ్లు ముందుగానే సాధించింది.