స్వచ్ఛమైన పెట్రోల్ మీ బాబు ఇంటి నుంచి వస్తుందా?: బీజేపీ ఎంపీ
- పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని విమర్శిస్తున్న వారిపై బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఫైర్
- స్వచ్ఛమైన పెట్రోల్ మీ బాబు ఇంటి నుంచి వస్తుందా? అని ఘాటు వ్యాఖ్య
- దేశ అవసరాల్లో 80 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడి
- ఇథనాల్ వాడకంతో ఇంజిన్లకు నష్టం జరగదని నిపుణులు చెప్పారన్న ఎంపీ
- బ్రెజిల్లో వాహనాలు 100శాతం ఇథనాల్తోనే నడుస్తున్నాయని వ్యాఖ్య
మధ్యప్రదేశ్లోని రేవా నియోజకవర్గ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా, కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి.. "స్వచ్ఛమైన పెట్రోల్ మీ బాబు ఇంటి నుంచి వస్తుందా?" అని ఆయన ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన మిశ్రా, దేశ ఇంధన అవసరాలపై కీలక విషయాలు వెల్లడించారు. భారత్ తన అవసరాల్లో కేవలం 20 శాతం ముడి చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోందని, మిగిలిన 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా, కొన్నిసార్లు చమురు ట్యాంకర్లు మన దేశానికి సరఫరా చేయడానికి అదనంగా 18,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇథనాల్ బ్లెండింగ్ గురించి మాట్లాడితే, కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. "ఇథనాల్ పనిచేయదు, మాకు స్వచ్ఛమైన పెట్రోల్ కావాలి అంటూ ఒక ఉద్యమం నడుస్తోంది. స్వచ్ఛమైన పెట్రోల్ మీ బాబు ఇంటి నుంచి వస్తుందా? దేశంలో స్వచ్ఛమైన పెట్రోల్ లేనప్పుడు, అది ఎక్కడి నుంచి వస్తుంది?" అని మిశ్రా ప్రశ్నించారు.
ప్రపంచంలో బ్రెజిల్ అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేస్తోందని, అందుకే అక్కడి వాహనాలు 100 శాతం ఇథనాల్తో నడుస్తున్నాయని ఆయన ఉదాహరించారు. మన దేశంలోని వాహనాలు కూడా ఇథనాల్తో కలిపిన పెట్రోల్పై నడవగలవని స్పష్టం చేశారు. ఇథనాల్ వాడకం వల్ల వాహన ఇంజిన్లకు ఎలాంటి నష్టం జరగదని భారత నిపుణులు తేల్చారని, ఈ విధానంపై అనవసరంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వాడకంపై విస్తృతమైన పరీక్షలు నిర్వహించామని, దీనివల్ల ఇంజిన్ దెబ్బతినడం, తుప్పు పట్టడం లేదా వాహన జీవితకాలం తగ్గడం వంటి ఆధారాలు ఏవీ లభించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బయో గ్యాస్, సీఎన్జీ వంటి ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలను కూడా మిశ్రా ఈ సందర్భంగా ప్రశంసించారు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన మిశ్రా, దేశ ఇంధన అవసరాలపై కీలక విషయాలు వెల్లడించారు. భారత్ తన అవసరాల్లో కేవలం 20 శాతం ముడి చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోందని, మిగిలిన 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా, కొన్నిసార్లు చమురు ట్యాంకర్లు మన దేశానికి సరఫరా చేయడానికి అదనంగా 18,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇథనాల్ బ్లెండింగ్ గురించి మాట్లాడితే, కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. "ఇథనాల్ పనిచేయదు, మాకు స్వచ్ఛమైన పెట్రోల్ కావాలి అంటూ ఒక ఉద్యమం నడుస్తోంది. స్వచ్ఛమైన పెట్రోల్ మీ బాబు ఇంటి నుంచి వస్తుందా? దేశంలో స్వచ్ఛమైన పెట్రోల్ లేనప్పుడు, అది ఎక్కడి నుంచి వస్తుంది?" అని మిశ్రా ప్రశ్నించారు.
ప్రపంచంలో బ్రెజిల్ అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేస్తోందని, అందుకే అక్కడి వాహనాలు 100 శాతం ఇథనాల్తో నడుస్తున్నాయని ఆయన ఉదాహరించారు. మన దేశంలోని వాహనాలు కూడా ఇథనాల్తో కలిపిన పెట్రోల్పై నడవగలవని స్పష్టం చేశారు. ఇథనాల్ వాడకం వల్ల వాహన ఇంజిన్లకు ఎలాంటి నష్టం జరగదని భారత నిపుణులు తేల్చారని, ఈ విధానంపై అనవసరంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వాడకంపై విస్తృతమైన పరీక్షలు నిర్వహించామని, దీనివల్ల ఇంజిన్ దెబ్బతినడం, తుప్పు పట్టడం లేదా వాహన జీవితకాలం తగ్గడం వంటి ఆధారాలు ఏవీ లభించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బయో గ్యాస్, సీఎన్జీ వంటి ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలను కూడా మిశ్రా ఈ సందర్భంగా ప్రశంసించారు.