పొత్తులపై జనసేన తెలంగాణ శాఖ కీలక వ్యాఖ్యలు

Janasena Telangana unit makes key comments on alliances
  • తెలంగాణలో పొత్తులపై శంకర్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
  • పొత్తులపై నిర్ణయం పవన్‌, బీజేపీ నాయకత్వానిదేనని వెల్లడి
  • పొత్తు లేకపోతే జనసేన సొంతంగా పోటీ చేస్తుందని స్పష్టీకరణ
  • తెలంగాణలో జనసేనకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న బీజేపీ
తెలంగాణలో పొత్తులపై జనసేన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుల అంశాన్ని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ జాతీయ నాయకులు నిర్ణయిస్తారని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పరిధిలోని అంశం పరిధిలోనిది కాదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీతో పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతుందని శంకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో జనసేనకు ఆదరణ క్రమంగా పెరుగుతోందని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ మంచి పనులు చేస్తున్నారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని.. దీంతో ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌ రావు కూడా పొత్తులపై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

జాతీయ స్థాయిలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అన్నదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. 
Advertisement
Janasena Party
Shankar Goud
Pawan Kalyan
Telangana Elections
BJP Janasena Alliance
Ramchander Rao

More Telugu News